సైదాబాద్ సింగరేణిలోని కొందరు స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై స్థానికులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పలువురు మహిళా పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.