హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 19, 20వ తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, పబ్లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 20న సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, పబ్లను మూసి ఉంచనున్నారు.