ఈనెల 20, 21 తేదీల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న తెలిపారు. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శని, ఆదివారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.