ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం : మంత్రి సత్యవతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 04:19 PM

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల సమస్యపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, అజయ్ కుమార్ పాల్గొని చర్చించారు. రెండు గంటలకు పైగా పోడు భూముల సమస్యలపై చర్చించారు.పర్యావరణ – పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడటంపై కమిటీ క్షుణ్ణంగా చర్చించింది. ఈ నెల 24న మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.


ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com