మహబూబ్నగర్ పట్టణం శ్రీనివాస కాలని ఊరగుట్టలొ దోపిడి దొంగలు హల్చల్ చేశారు. దైవ దర్శనానికి తిరుపతికి వెళ్ళిన నవీన్ గౌడ్ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. 6 తులాల బంగారంతో పాటు 10 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు వెల్లడించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. _