కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, సూరారం, సుభాష్ నగర్ ల టిఆర్ఎస్ పార్టీ డివిజన్ కమిటీల ఎన్నికకు శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, బి.విజయ్ శేఖర్ గౌడ్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డితో కలిసి 125 డివిజన్ రెండవ సారి అధ్యక్షుడిగా విజయ్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నవాబ్, 126 డివిజన్ నూతన అధ్యక్షుడిగా రుద్ర అశోక్, ప్రధాన కార్యదర్శిగా హజ్రత్ అలీ, 127 డివిజన్ నూతన అధ్యక్షుడిగా ఏర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా జి.సుధాకర్, 129 డివిజన్ రెండవ సారి అధ్యక్షుడిగా పుప్పాల భాస్కర్, నూతన ప్రధాన కార్యదర్శిగా సిద్ధిక్, 130 డివిజన్ నూతన అధ్యక్షుడిగా పోలె శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా శివాజీ మరియు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా, యువజన, సోషల్ మీడియా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో ఎన్నికైన సభ్యులంతా సమర్ధవంతంగా పని చేసి పార్టీకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత తప్పక ఉంటుందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని పేర్కొన్నారు. ప్రతి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ పార్టీ మరింత బలోపేతంకు కృషి చేయాలన్నారు.