ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాస్టల్ లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య...!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 06:16 PM

హాస్టల్ లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరానగర్ నగర శివార్లలోని మైసమ్మగూడలో చోటుచేసుకుంది.  జనగామ జిల్లాకు చెందిన కొయేటి మాధవి(20).. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతుంది. కాలేజీకి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటుంది. అయితే శుక్రవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గుర్తించిన హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com