తెలంగాణకు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడుల వెల్లువ ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో పరిశ్రమ తెలంగాణాలో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు ఈ రోజు సదరు కంపెనీ తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్పూర్లో ప్లాంటు ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు జరిగిన అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్తో పాటు కంపనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు.