రెబ్బెన: షెడ్యూల్ కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి శనివారం షెడ్యూల్ కులస్తులు పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్ కు ఎస్సీ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. దళిత బంధు పథకం ఎస్సీలను ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పథకం ద్వారా ఎస్సీల జీవన స్థితిగతులు ఎంతో మారి పోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహార్ నేతకాని సంఘం మండలాధ్యక్షుడు పెరుగు శంకర్, వార్డు సభ్యులు దుర్గం భరద్వాజ్, గోగర్ల రాజేశ్, దుర్గం బయ్య, నాయకులు జుమ్మిడి అనందరావు, దుర్గం రాజేశ్, వస్రంనాయక్, గుంపుల విమలేశ్, అశన్న, మోహన్, లోకేశ్తో పాటు పలువురు పాల్గొన్నారు.