రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆల్టో కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు సజీవ దహనం అయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు.