ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్‌ నిమజ్జనం రిత్యా.. హైదరాబాద్‌ మెట్రో సేవలు పొడిగింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 10:55 PM

ఆదివారం గణేష్‌ నిమజ్జనం దృష్టా హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక సేవలు అందించనుంది. రేపు అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అంతేగాక ఈ అర్థరాత్రి నుంచి అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అదే విధంగా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలని సూచించారు..... 


40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లు... మరోవైపు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి పోలీసులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై ఎలాంటి సమస్య తలెత్తకుండా భారీ క్రేన్స్‌తో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లను ఉంచారు. ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జనానికి ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. .5 కిలోమీటర్ల పొడవునా ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర సాగనుంది. క్రేన్‌ నెంబర్‌ 4లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమ్మజనం జరగనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com