ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోని 11 బిసి స్టడీ సర్కిళ్లలో శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్లాసుల నిర్వహణ జరుగుతుందని అధికారులు తెలిపారు. అభ్యర్ధులు చాలా ఉత్సాహంగా క్లాసులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా శిక్షణా తరగతులకు హాజరు కావాలనుకునే వారు తమ పేర్ల నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వారి నివసించే ఏరియాలోని స్టడీ సర్కిళ్లలో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చు. ఆన్లైన్ క్లాసులు, యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా క్లాసులు కొనసాగుతాయని బిసి స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ బాలాచారి నామోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.