కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని హెచ్ఎంటి కంపెనీలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన "ఆయుధ పూజ"లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆయుధ పూజ చెడుపై మంచి సాధించిన విజయాన్ని, దుర్గాదేవి మహిషాసురుని రాక్షసుడిని నాశనం చేసిన వేడుకగా జరుపుకుంటారని అన్నారు. అమ్మవారి కృప ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్, శ్రీశైలం, సత్యనారాయణ, ఆనంద్ రావు, మహేందర్, చారి, శ్రీనివాస్ నాయక్, గోపాల్ కుమార్, రవీందర్, కృష్ణ, ప్రసాద్, దానప్ప, టిజికే సింగ్, లక్ష్మయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.