సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీ కుమార్తె మృతి చెందారు. కూతురు కాలుజారి చెరువులో పడగా ఆమెను కాపాడబోయి తల్లి కూడా చెరువులో పడిపోయింది. గల్లంతైన తల్లీకూతుళ్లు రోజా(25), చైత్ర(5) కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే వారు తమ ప్రాణాలను కోల్పోయారు. స్థానికులు తల్లీకూతుళ్ల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. వారి మరణంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుగా ఉంది.