హుజురాబాద్లో దళిత బంధు పథకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో దళిత బంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకం యథావిధిగా కొనసాగించవచ్చని సూచించింది