ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ప్రతి శుక్రవరం ‘గ్రీన్‌డే’గా పాటించాలి : మేయర్‌ విజయలక్ష్మి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 10:31 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ప్రతి శుక్రవారాన్ని గ్రీన్‌ డేగా పాటిస్తున్నట్లు మేయర్‌ విజయలక్ష్మి శనివారం ప్రకటించారు. ప్రతి శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.“ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 3 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రజలందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను'' అని మేయర్ తెలిపారు.ఖైరతాబాద్ జోన్‌లోని జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు మోటార్‌సైకిళ్లపై రాకపోకలు సాగించాలని, తమ పరిధిలోని గుంతలు, పౌరుల ఫిర్యాదులను గమనించాలని మేయర్ కోరారు. ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్  పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలనిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com