గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి శనివారం ప్రకటించారు. ప్రతి శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.“ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 3 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రజలందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను'' అని మేయర్ తెలిపారు.ఖైరతాబాద్ జోన్లోని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు మోటార్సైకిళ్లపై రాకపోకలు సాగించాలని, తమ పరిధిలోని గుంతలు, పౌరుల ఫిర్యాదులను గమనించాలని మేయర్ కోరారు. ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలనిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.