ఆదివారం తెల్లవారుజామున హుస్సేన్సాగర్లో కారు పడిపోవడంతో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్కు చెందిన ముగ్గురు యువకులు తమ కారులో అఫ్జల్గంజ్కు వెళ్తుండగా డ్రైవర్ అదుపు తప్పి ఎన్టీఆర్ పార్క్లోని హుస్సేన్సాగర్లోని ఫుట్పాత్పై నుంచి కారు జారిపడింది. ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు.