తెలంగాణలోగత 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు చేయగా,అందులో 184 మందికి పాజిటివ్అని తేలింది. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కరోనా కేసులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 33 కరోనా కేసులు నమోదయ్యాయి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు వచ్చాయి. అయితే అదే సమయంలో 137 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు, ఒకరు మృతి చెందారు.