శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.1.09 కోట్ల విలువైన 2 కిలోల 200 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. కువైట్, ఖతార్, సౌదీ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.ఫుడ్ ట్రేల లోడింగ్, అన్ లోడింగ్ చేసే క్రమంలో బంగారాన్ని బయటకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.