కరోనా కొత్త రకం ఓమిక్రాన్ వ్యాపిస్తున్న ఈ సమయంలో యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓమిక్రాన్ వేరియంట్ భయం మధ్య, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్లో ఎటువంటి సమావేశాలు, పండుగలు నిర్వహణ చేయవద్దని. అందరు కరోనా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని విద్యార్థులను హెచ్చరించింది.ఎటువంటి ఈవెంట్లకు పర్మిషన్ లేదని తెలిపింది.
“చాలా మంది స్టూడెంట్స్ ఇంకా సిబ్బంది క్యాంపస్లో కోవిడ్- నియమాలు పాటించకపోవడం ఆందోళనకరంగా మారిందని .“మేము మన రక్షణను వదులుకుంటే క్యాంపస్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులచే ఇబ్బందులు ఎదురొకోవాల్సి ఉంటుందని తెలిపింది. మా అకడమిక్ మరియు రీసెర్చ్ కార్యకలాపాలను మళ్లీ ప్రభావితం చేసే సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ను విశ్వవిద్యాలయం ప్రోత్సహించదని తెలిపింది.
క్యాంపస్లో కోవిడ్-19 తగిన ప్రవర్తనను కొనసాగించాలని విశ్వవిద్యాలయం విద్యార్థులందరికీ, బోధన మరియు బోధనేతర సిబ్బందికి సూచించింది. పెద్దగా సమావేశాలు నిర్వహించడం మానుకోవాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని భాగస్వాములందరికీ సూచించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేయాలని మరియు ఏవైనా లక్షణాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించాలని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.