తెలంగాణ లో గత 24 గంటల్లో 40,018 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 193 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కరోనా కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఒకరు మృతి చెందారు.