ఆ ముగ్గురు వైద్య విద్యార్థులు. అర్ధరాత్రి పూల్గా మద్యం తాగారు. ఒకరు మత్తులోనే అతివేగంగా కారు నడిపి నలుగురు పాదచారులను ఢీకొట్టాడు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన ఎ.నిఖిల్రెడ్డి(26), వైజాగ్లోని తారకరాంనగర్కు చెందిన మెండు తరుణ్(24), మహారాణిపేటకు చెందిన గొట్టి ముక్కుల అఖిల్(23) ముగ్గురు స్నేహితులు. పీజీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొండాపూర్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిఖిల్రెడ్డి కారులో ఇనార్బిట్ మాల్లోని ఫ్యూజన్ పబ్కు వచ్చారు. మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి బయలుదేరారు. నిఖిల్రెడ్డి కారును నడుపుతూ దుర్గం చెరువు నర్సరీ వద్ద నేపాల్కు చెందిన రాహుల్ గౌతమ్(24), పంకజ్ అగ్రహారి, వినోద్ నాయక్(19), సూరజ్ గౌతమ్(27)లను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా వలస వచ్చి మాదాపూర్ అరుణోదయ కాలనీలో ఉంటున్నారు. నిఖిల్రెడ్డిని రక్తంలో మద్యం మోతాదు 116 ఎంజీగా ఉన్నట్లు తేలింది. డ్రైవర్ పక్క సిట్లో ఉన్న వ్యక్తి ఆల్కహాల్ 35 ఎంజీగా తేలింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.