రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చెరువులో బయటకి తేలుతూ మృతదేహం స్థానికులకు కనిపించగా ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని తాడు సహాయంతో బయటకి తీశారు. రెండు రోజుల క్రితం వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.