బీజేపీలో తీన్మార్ మల్లన్న చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీన్మార్ మల్లన్న నిప్పులు చెరిగారు. తాను తీసుకున్నది బీజేపీ సభ్యత్వ రసీదు కాదని, 15 మీటర్ల తాడని అన్నారు. ఆ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తానని హెచ్చరించారు. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసిఆర్ అని, ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే, ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయని తెలిపారు. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చానని, తనపై 38 కేసులు పెట్టి వాటితో కేసిఆర్ ఎం సాధించారని నిలదీశారు. ప్రజలలోకి వెళ్లి కేసిఆర్ పై పోరాడుతానన్నారు.