విధులు నిర్వర్తించే సమయంలో పోలీసు సిబ్బంది రోజువారీ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు క్రీడలు దోహదపడతాయని, వారిలో నూతనోత్తేజం నింపుతుందని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా అన్నారు.మంగళవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన రాచకొండ కమిషనరేట్ 4వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2021లో ఆయన మాట్లాడారు. సరూర్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, గోషామహల్లోని నాలుగు వేదికల్లో పోటీలు జరుగుతాయని, డిసెంబర్ 10న ముగింపు వేడుకలు జరుగుతాయని, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.