తెలంగాణలో గత 24 గంటల్లో 40,730 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 203 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి, రంగారెడ్డి జిల్లాలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి , కరీంనగర్ జిల్లాలో 12 కరోనా కేసులు వెల్లడయ్యాయి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కరోనా కేసులు వచ్చాయి. అయితే అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకున్నారు, రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు.