సాంకేతిక అంశాల్లో తలదాచుకున్న కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రాష్ట్రం నుంచి వరి సేకరణపై మరోసారి చేతులు దులుపుకున్నారు. వరిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, తెలంగాణ వికేంద్రీకృత సేకరణ (డిసిపి) రాష్ట్రంగా ఉన్నందున వరి సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని ఆయన అన్నారు.బుధవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి బియ్యం సరఫరా చేయడం లేదని కేంద్రమంత్రి మరోసారి తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్కు సంబంధించిన బియ్యం సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగైదు పొడిగింపులు ఇచ్చిందని, అయితే అది జరగలేదన్నారు. "మేము మరో పొడిగింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మరియు పెండింగ్లో ఉన్న బియ్యం నిల్వలను త్వరగా సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించాము" అని ఆయన చెప్పారు.