ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 11:11 AM

నల్గొండ జిల్లా: నకిరేకల్ పట్టణంలో అభిషేక్ చౌహాన్ (22) అనే యువకుడు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, అభిషేక్ కుటుంబం మహారాష్ట్రకు చెందినది. అతని తండ్రి హనుమంతు గత 15 ఏళ్లుగా నకిరేకల్‌లో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి వ్యాపారం నిమిత్తం పట్టణంలో ప్రాథమికంగా రూ.కోటి వరకు బకాయిలున్నట్లు సమాచారం. అప్పుల వారి నుంచి తండ్రి నానా మాటలు చెప్పడంతో తట్టుకోలేక హనుమంతు కుమారుడు అభిషేక్ సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com