దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టించింది. సీసీఎస్, సైబర్ క్రైమ్లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్ కి వెళ్లి వచ్చారు. అందులో ఒక ఎస్సై కి కరోన పాజిటివ్ వచ్చింది. అతని నుంచి అందరికి సోకినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.