మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. వివరాల్లోకి వెళితే. పట్టణంలోని రెడ్డి కాలనీలో చీర్ల రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మేడా రాజేశ్వర్ రెడ్డి, పోటు మాధవరెడ్డి, చర్ల సమ్మిరెడ్డి, గుగులోత్ లక్ష్మణ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 22, 100 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు.