ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోరంపల్లి బంజారాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. బంజర పంచాయతీలోని రెండు పడక గదుల కాలనీకి చెందిన లక్ష్మయ్య (37) సోమవారం మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. మంగళవారం భార్య పనికి వెళ్లిన సమయంలో లక్ష్మయ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. లక్ష్మయ్య భార్య ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రాంబాబు కేసు నమోదు చేశారు.