తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడాం మండలం బెల్లాల్ సమీపంలో ఆరుగురితో వెళ్తున్న ఆటో కాలువలో పడింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను నిర్మల్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. మృతులను సీమల శాంత (55), శంకరవ్వ, మల్లయ్య (55)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.