తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల డీఏను 10.01 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన DA జూలై 1, 2021 నాటికి వర్తిస్తుంది. ఉద్యోగులు ఈ నెల నుండి వేతనంతో పాటు పెరిగిన DA కూడా అందుకుంటారు. ప్రభుత్వం జూలై 2021 నుంచి బకాయిలను జీపీఎఫ్లో జమ చేస్తుంది. కాగా, డీఏ పెంపు నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.