ఇల్లందు మండలం 5వ వార్డ్ లో కరోనా కట్టడికి వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేపట్టడం జరిగింది. అదే విధంగా వాక్సినేషన్ లో బాగంగా సెకండ్ డోస్ మరియు బూస్టర్ డోస్ వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కౌన్సిలర్ యలమందల వీణ, మాజీ కౌన్సిలర్ యలమందల వాసు, వార్డ్ అధ్యక్షుడు భోల్లి రవి, కార్యదర్శి టీ కళ్యాణ్, ఆర్ పి భార్గవి, వార్డ్ ఆఫీసర్ కళ్యాణ్, నర్స్ పాపమ్మ, అంగన్వాడీ విజయ, వార్డ్ పెద్దలు రమేష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.