జగిత్యాల జిల్లా దర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున యువత, మహిళా కార్యకర్తలు శనివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా యువకులందరికీ గులాబీ కండువాలు కప్పి కొప్పుల ఈశ్వర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని, అలాంటి వారు టిఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని అన్నారు. యువతను ఆకర్షించేలా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు.