తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ లో భారీ కుంభకోణం కు ప్లాన్ చేసారు. వివరాల్లోకి వెళ్తే .. తెలుగు అకాడమీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రధాన సూత్రధారి షేక్ మస్తాన్ వలీ సాహెబ్ తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ లో భారీ కుంభకోణానికి యత్నించాడు. తెలంగాణ గిడ్డంగుల శాఖ నుంచి రూ.3.98 కోట్లు (3 కోట్ల 98 లక్షలు). మస్తాన్ వలీపై ప్రస్తుత యూనియన్ బ్యాంక్ కారవాన్ బ్రాంచ్ మేనేజర్ గిరీష్ కుమార్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు సృష్టించారని గిడ్డంగుల శాఖ ఫిర్యాదు చేసింది. మస్తాన్ వలీ ఇప్పటికే తెలుగు అకాడమీ స్కాంలో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో మస్తాన్ చంచల్గూడ జైలులో ఉన్నాడు. సీసీఎస్ పోలీసులు మస్తాన్ వలీని పీటీఐ వారెంట్పై అదుపులోకి తీసుకుని తాజా కేసులో విచారించనున్నారు.