శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ.1.36 కోట్ల విలువైన బంగారo కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ ప్రయాణికుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి నుంచి రూ.1.36 కోట్ల విలువైన 2,715,800 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులను మోసం చేసేందుకు కేటుగాడు తన వెంట తెచ్చుకున్న సరుకులో బంగారు గొలుసులు, పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచాడు అని కస్టమ్స్ అధికారులు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు.