నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి ఓక రిక్వెస్ట్ పంపారు. తెలంగాణ ప్రభుత్వం పిల్లల విద్యలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ పై దృష్టి పెట్టాలి అంటూ సూచన చేసారు. ఇంకా తెలంగాణలో అమలవుతున్న ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం చాలా బాగుందన్నారు. టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ ద్వారా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు ఏడేళ్లుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు మంచు లక్ష్మి. పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఈ అనుభవంతో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఆ సూచన చేశారు లక్ష్మి. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ పై దృష్టి పెట్టాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పద్ధతి వల్ల రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. కాబట్టి దీనిపై దృష్టి సారించాలని మంచు లక్ష్మి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.