నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి. శ్రీరామలింగేశ్వర స్వామి గుట్ట సమీపంలోని గొబ్బలమ్మ తల్లి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.