కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఎస్ శ్రావణ్ కుమార్ (35) అనే వ్యక్తి సెలూన్లో పనిచేస్తూ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఒక కుమార్తె ఉంది, ఆర్థిక విషయాలపై దంపతులు తరచూ గొడవలు పడుతుండేవారని,అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు.