ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంబేలెత్తిస్తున్న కోతులు...ఏకంగా ప్రభుత్వమే కదాల్సి వచ్చింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 11:27 PM

కోతులు బెడదకు ఏకంగా తెలంగాణ సర్కార్ ప్రత్యేక మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఇది నిజం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, పల్లెల్లో పంటలను నాశనం చేయడం, ప్రజలపై దాడులు చేయడం వంటి ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కోతుబ బెడదను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 6లక్షల కోతులు ఉంటాయని అంచనా వేసిన కమిటీ... వాటి సంఖ్యను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఒక్కటే మార్గమని చివరికు తేల్చింది. దీని కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచన ప్రాయంగా అంగీకరించింది. కోతుల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నాశనమైపోతున్నాయని, రైతులకు వాటి బెడద తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్టు కమిటి తెలిపింది. అయితే దీనికి కుటుంబ నియంత్రణ ఒక్కటే మార్గమా? లేక ఇతర పద్ధతులేమైనా ఉన్నాయా? అన్నది అధ్యయనం చేస్తున్నామని కమిటీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అమలుచేస్తున్న విధానాలపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నామని మంత్రులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com