కారోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం లో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజు దాదాపు 4వేల కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 10 దాటితే కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రెస్ మీట్ లో అన్నారు. కాగా, మేడారం జాతర వల్ల కారోనాకేసులు పెరిగే అవకాశం ఉండటంతో జాతర తరువాత రాష్ట్రం లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని సమాచారం.