ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఏఎస్ అధికారి కూతురి పెళ్లి ఏర్పాట్లపై రేవంత్ ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 28, 2022, 10:03 AM

తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కుమార్తె వివాహ ఏర్పాట్లపై రాజకీయ విమర్శలు భగ్గుమంటున్నాయి. ఈ పెళ్లికి తెలంగాణలో బడా ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఓ ప్రముఖ కంపెనీ ఫైవ్ స్టార్ హోటల్ లో ఏర్పాట్లు చేసిందని ‘ది న్యూస్ మినిట్’ వెబ్​సైట్​ ప్రచురించిన ఇన్వెస్టిగేటివ్ కథనం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశిస్తుందా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ ఖరీదైన వివాహానికి ఒక ప్రముఖ సంస్థ ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇందులో ఉన్న క్విడ్‌ ప్రో కోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం.. డిసెంబర్ 20న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ. 16,520 చొప్పున బిల్లింగ్ అయిందని స్టోరీలో పేర్కొంది. ఈ కథనానికి సంబంధించిన న్యూస్ లింక్ ను రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com