మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాలలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య కళాశాల, అదనపు గదుల నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
మెడికల్ కాలేజీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. పనుల్లో వేగం పెంచాలని, పెండింగ్లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించి కళాశాలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు.
అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల ఆర్డీఓ మాధురి, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదకష్ణాదేవి, ఆర్ఎంఓ రామకృష్ణ, సీపీఓ పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.