తెలంగాణ కళాకారుడు, పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. కిన్నెర మొగిలయ్యకు ఇల్లు, ఖర్చులకు రూ.కోటి రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. అనంతరం ఆయనను ప్రగతి భవన్ లో సన్మానించారు. మొగిలయ్యకు ప్రతినెల గౌరవే వేతనం కూడా అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కళాకారులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.