మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హాజ్రత్ అబ్దుల్ ఖాదర్ షా రహేమతుల్లా అలై దర్గా83వ ఉర్సు ఉత్సవాలు శనివారం ప్రారంభం కనున్నాయి. మొదటి రోజు రాత్రి 8 గంటలకు జలాభిషేకం నిర్వహించనున్నారు. 30వ తేదీన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గందోత్సవం జరుగుతుంది. 31న దీపారాధన(చిరగా) వేడుకలతో దర్గా ఉర్సు ముగుస్తుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా భక్తులు కోవిడ్ నిబంధనలు అధికారులు పాటించాలని సూచించారు.