బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షావచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రేవంత్ ప్రశ్నలు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యమేంటి? పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలు.
ధాన్యం రైతుల మరణాలకు బాధ్యులెవరు? పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలి. నిజామాబాద్లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? భద్రాద్రి రాముడికి రామాయణం సర్క్యూట్లో చోటు ఏది? అయోధ్య రాముడు. భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా? అంటూ రేవంత్ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు.