హైదరాబాద్లో ప్రేమ పెళ్లి చేసుకోవడంతో శుక్రవారం కొందరు దారుణానికి పాల్పడ్డారు. బేగంబజార్ ప్రాంతంలో నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అతని శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నాయి.నీరజ్ పన్వార్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. యువతి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. సమీపంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నీరజ్ పన్వార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.