హనుమకొండ జిల్లా టిఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ నాగమల్ల ఝాన్సీ రాణి , ఎన్నారై నాగమల్ల సంతోష్ అధికార టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.