తెలంగాణలో గత 24 గంటల్లో 29,084 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 493 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.హైదరాబాద్లో ఎక్కువగా 366 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా మరణాలు ఏవీ నివేదించబడలేదు.తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.